తెలంగాణలో కొత్తగా 2,384 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 1,08,696 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 307 కేసులు
  • నిర్మల్ జిల్లాలో 9 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 17 మంది మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడచిన 24 గంటల్లో 1,08,696 కరోనా పరీక్షలు నిర్వహించగా... 2,384 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 307 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,242 మంది కరోనా నుంచి కోలుకోగా, 17 మంది మరణించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,83,228 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,46,536 మందికి కరోనా నయమైంది. ఇంకా 33,379 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,313కి చేరింది.

Telangana
Second Wave
Corona Virus
New Cases
Deaths
Daily Cases

More Telugu News